కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత కేటగిరీ సహా అన్ని విధానాల ద్వారా ఇప్పటికి మొత్తం 40.31 కోట్లకుపైగా (40,31,74,380) కరోనా వ్యాక్సిన్ డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించినట్టు తెలిపారు.
ఇందులో వ్యాక్సిన్ వృధాతో కలిపి జూలై 15, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 38,39,02,614 డోసులను వినియోగించినట్టు ప్రకటించారు. ఇక అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ప్రస్తుతం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు 1.92 కోట్లకుపైగా (1,92,71,766) నిల్వలు, వినియోగించని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అలాగే మరో 83.8 లక్షల (83,85,790) వ్యాక్సిన్ డోసులు పైప్ లైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ