దేశ నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్చంద్ర పదవీకాలం మే 14, శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన సీఈసీగా అత్యంత సీనియర్ ఎలక్షన్ కమిషనర్ అయిన రాజీవ్ కుమార్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. 25వ సీఈసీగా రాజీవ్ కుమార్ మే 15, ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించనున్నారు.
1984 బ్యాచ్ బీహార్ కేడర్ చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి అయిన రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 2020లో సర్వీస్ నుండి పదవీ విరమణ పొందారు. అనంతరం 2020 ఏప్రిల్ లో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (పిఇఎస్బి) ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించగా, సెప్టెంబర్ 1, 2020 నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ అయిన రాజీవ్ కుమార్ ను సీఈసీ నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF