భారతీయ కిసాన్ యూనియన్ నుంచి అధ్యక్షుడు రాకేష్ టికాయత్ ను బహిష్కరించారు. ఈ మేరకు చౌహాన్తో సహా ఏడుగురు నేతలను రైతు సంఘం నుంచి బహిష్కరించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. రాకేష్ టికాయత్ తో పాటు ఆయన సోదరుడు బీకేయూ అధ్యక్షడు నరేష్ టికాయత్ ను కూడా బీకేయూ నుంచి తొలగించారు. దేశవ్యాప్తంగా అనేక రైతు ఉద్యమాలలో పాల్గొన్న నేతగా రాకేష్ టికాయత్ కు పేరుంది. రెండవసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల ఆందోళనలలో భారతీయ కిసాన్ యూనియన్ గణనీయమైన పోరాటం చేసింది. ఈ సుదీర్ఘ పోరాటానికి రాకేష్ టికాయత్ నేతృత్వం వహించారు.
అయితే అంతర్గతంగా నెలకొన్న పలు విభేదాల కారణంగా పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిగా రాజేష్ సింగ్ చౌహాన్ ను ఎన్నుకున్నారు. రాజేష్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని రైతు నాయకుల బృందం భారతీయ కిసాన్ యూనియన్ (అరాజ్నైటిక్) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి హిందీలో అర్ధం.. అంటే రాజకీయ రహితమైనది. భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు చౌదరి మహేంద్ర సింగ్ టికాయత్ వర్ధంతి సందర్భంగా లక్నోలో జరిగిన కార్యక్రమంలో చౌహాన్ మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టం నిరసనలు మరియు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాకేశ్ టికాయత్ చేసిన రాజకీయ ప్రకటనలపై తాము సంతోషంగా లేమని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ