దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా సంక్షోభంతో దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకున్న దృష్ట్యా “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ మే 22, శుక్రవారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత రెండు నెలల్లో శక్తి కాంత దాస్ మీడియా సమావేశం నిర్వహించడం ఇది మూడోసారి. రెపోరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. అలాగే రివర్స్ రెపోరేటు కూడా 3.35 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా శక్తి కాంత దాస్ పలు నిర్ణయాలను వెల్లడించారు
ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- రెపోరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.40 నుంచి 4 శాతానికి తగ్గింపు.
- రివర్స్ రెపోరేటు కూడా 3.35 శాతానికి తగ్గింపు.
- టర్మ్లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పాటు అనగా ఆగస్టు 31 వరకు పొడిగింపు.
- మార్చ్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గుదల.
- మార్చ్, ఏప్రిల్ నెలల్లో సిమెంట్,ఉక్కు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం.
- కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం.
- ప్రపంచ వాణిజ్యం 13 నుంచి 32 శాతం మేర తగ్గింది.
- దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడింది.
- ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు ఆర్బీఐ చర్యలు, ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం.
- వర్కింగ్ కేపిటల్ పెంపు కోసం పలు చర్యలు.
- 2020-2021 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి ప్రతికూలంగా ఉంటుందని అంచనా.
- మర్చండైస్ ఎగుమతులు 30 సంవత్సరాలలో అత్యంత తక్కువ స్థాయికి క్షిణించాయి.
- యుఎస్ డాలర్ స్వాప్ సదుపాయాన్ని పొందడానికి ఎక్సిమ్ బ్యాంకులకు రూ.15 వేల కోట్లు కేటాయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu