తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ఒక్క వలస కార్మికుడు కూడా కాలినడకన తన సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిన దుస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను అదేశించారు. వలస కార్మికులు తమ సొంత ప్రాంతానికి పోవడానికి అవసరమైన రైళ్లు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. రైళ్లు లేని ప్రాంతాల నుంచి అవసరమైతే బస్సుల ద్వారా తరలించాలని సూచించారు. తమ సొంత ప్రాంతానికి వెళ్లాలని కోరుకునే వలస కార్మికులెవరు నడిచి పోవాలనే ఆలోచన చేయవద్దని, తెలంగాణ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని తమ సొంత ప్రాంతాలకు వారిని తరలిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 74 రైళ్లలో 1,01,146 వలసకార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించినట్టు ఇటీవలే సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. 74 రైళ్లల్లో బీహార్ కు (26) , ఉత్తర ప్రదేశ్ (14), చత్తీస్ గడ్ (2), ఓడిశా (4), మధ్యప్రదేశ్ (7) , జార్ఖండ్ (11), రాజస్థాన్ (5), ఉత్తరా ఖండ్ (1), పశ్చిమ బెంగాల్ (1), ఈశాన్య రాష్ట్రాలు(2), జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్ (1) కు వెళ్లిన రైళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మిగిలిన వలస కార్మికుల రవాణాకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu