బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ లో కీలక పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ ఈ రోజు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆర్జేడీ పార్టీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు పంపించారు. ఆయన గతంలోనే పార్టీ ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ఆర్జేడీకి కీలకంగా మారిన సమయంలో రఘువంశ్ ప్రసాద్ సింగ్ రాజీనామా ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే(జేడియూ-బీజేపీ) కూటమిలో ఆయన త్వరలోనే చేరుతారనే ప్రచారం జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu