ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత నిచ్చింది. ఈ అంశంపై తాజాగా ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా లేదని, మూడు రాజధానుల విషయంలో రాష్ట్రప్రభుత్వానిదే పూర్తి నిర్ణయాధికారమని కేంద్రం తెలిపింది. రాజధాని నిర్మాణంలో అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని మాత్రమే చెప్పినట్లు కేంద్రం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu