రష్యా-ఉక్రెయిన్ల మధ్య మొదలైన సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ దేశాలు భయపడుతున్నట్లుగానే రష్యా చివరికి ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్లో సైనిక చర్యను ప్రకటించారు. ఈనేపథ్యంలో.. రాజధాని కైవ్ మరియు మరో ముఖ్య నగరమైన ఖార్కివ్ లలో బాబుల పేలుళ్లతో వణికిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా భారీసంఖ్యలో 1,50,000 నుంచి 2,00,000 మంది తన సైనికులను మోహరించింది. యుద్ధాన్ని నివారించడానికి పలు పాశ్చాత్య దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా, తూర్పు ఉక్రెయిన్లోని తిరుగుబాటు నాయకులు కైవ్పై సైనిక సహాయం కోసం మాస్కోను సంప్రదించినట్లు క్రెమ్లిన్ పేర్కొంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘నేను సైనిక చర్యకు నిర్ణయం తీసుకున్నాను’ అని ఈరోజు ఉదయం మాస్కోలో ఒక టెలివిజన్ ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్ సైనికులను వారి ఆయుధాలు వదిలివేయాల్సిందిగా పిలుపునిచ్చారు. పుతిన్ యుద్ధం ప్రకటించిన 30 నిమిషాల వ్యవధిలో ఉక్రెయిన్ రాజధాని కైవ్లో పేలుళ్ల శబ్దం వినిపించింది. అందుతున్న సమాచారం ప్రకారం తూర్పు ప్రాంత నగరమైన మారియుపోల్, ఇంకా ఒడెస్సాలో కూడా పేలుళ్లు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అగ్రరాజ్యం అమెరికా దీనిపై తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు బైడెన్ వెంటనే రష్యాను తదుపరి ఎదుర్కోబోయే పరిణామాల గురించి హెచ్చరించాడు. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీ విధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ