దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల నేపథ్యంలో.. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసి) గురువారం 5-12 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ‘కోర్బెవాక్స్ వ్యాక్సిన్’ కోసం సిఫార్సు చేసింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ సమావేశంలో పిల్లల్లో వ్యాక్సిన్ వాడకంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసి ద్వారా చేయబడిన సిఫార్సులు ఇప్పుడు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం కోసం పంపబడ్డాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తుది అనుమతి ఇవ్వడానికి ముందు డిసిజిఐ ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇది ఇవ్వబడుతోంది. కోర్బెవాక్స్ వ్యాక్సిన్ అనేది కోవిడ్-19ని ఎదుర్కొనేందుకు దేశీయంగా అభివృద్ధి చేయబడిన రిసెప్టర్ బైండింగ్ డొమైన్ యొక్క ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. కాగా కార్బెవాక్స్ భారతదేశంలోని మూడవ స్వదేశీ టీకా కావడం గమనార్హం.
డిసిజిఐ అంతకుముందు డిసెంబరు 28న పెద్దవారిలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం కోర్బెవాక్స్ వ్యాక్సిన్ ని ఆమోదించింది. కోర్బెవాక్స్ టీకా 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదులతో ఇంట్రామస్కులర్ మార్గంలో ఇవ్వబడుతుంది. ఇది 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయబడుతుంది. బయోలాజికల్ E లిమిటెడ్ క్వాలిటీ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ హెడ్ శ్రీనివాస్ కొసరాజు మాట్లాడుతూ.. 5-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యుక్తవయస్కులలో కార్బెవాక్స్ యొక్క 2/3 దశ క్లినికల్ అధ్యయనాన్ని నిర్వహించడానికి సంస్థ ఆమోదం పొందిందని తెలిపారు. భారతదేశం ప్రస్తుతం 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు రెండు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ