ప్రపంచ దేశాలు చేస్తున్న హెచ్చరికలను పెడచెవిన పెడుతూ ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన రష్యా ఇప్పుడు కొంచెం తన దూకుడుని తగ్గించబోతోంది. ఉక్రెయిన్తో చర్చల కోసం బెలారస్కు ప్రతినిధి బృందాన్ని పంపడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమయ్యారు. రష్యా పంపే బృందంలో రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు అధ్యక్ష పరిపాలన ప్రతినిధులు ఉండనున్నారు. రష్యా దళాలు ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కైవ్ను చేరుకున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై గతంలో శాంతి చర్చలను నిర్వహించిన బెలారస్ రాజధాని మిన్స్క్కు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు. ఉక్రేనియన్ ప్రతినిధి బృందంతో చర్చల కోసం తాము సంప్రదిస్తున్నట్లు ఆయన చెప్పారు.
రష్యా బెలారస్లో వేల సంఖ్యలో సైనికులను కలిగి ఉంది. బెలారస్ నుండి కూడా ఉక్రెయిన్ దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే, ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యా నాయకుడితో చర్చలకు పదేపదే పిలుపునిచ్చారు. తాను ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపుతున్నట్లు పుతిన్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు చర్చలకు ప్రయత్నించానని, అయితే అది సఫలం కాలేదు అని జెలెన్స్కీ చెప్పాడు. శుక్రవారం కైవ్ని రష్యన్ దళాలు ఆక్రమించుకుంటున్న సందర్భంలో.. జెలెన్స్కీ మరోసారి చర్చలను కోరుతూ కొత్త ప్రకటనను విడుదల చేశారు. బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా రష్యా-ఉక్రెయిన్ చర్చలకు అవసరమైన అన్ని పరిస్థితులను కల్పిస్తానని హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ