ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన చర్చలు నిన్న (సోమవారం) అసంపూర్తిగా ముగిశాయి. ఉభయ దేశాల అధికారులు బెలారస్ సరిహద్దులోని గోమెల్లో సమావేశమయ్యారు. అయితే, చర్చల్లో కీలక నిర్ణయాలేమీ తీసుకోలేదని తెలిసింది. చర్చల్లో వ్యక్తమైన అభిప్రాయాలను ఇరుదేశాల అధినేతలకు తెలియజేయనున్నారు. అవసరమైతే, మరోసారి సమావేశం కావటానికి ఇరుపక్షాలు అంగీకరించాయని బెలారస్ వర్గాలు తెలిపాయి. ఉన్నతస్థాయి అధికారులతో చర్చలు దాదాపు ఐదు గంటల పాటు కొనసాగాయని, అయితే, ఎటువంటి కీలక ఒప్పందాలు లేకుండా చర్చలు ముగిశాయని తెలిపారు. రానున్న రోజుల్లో చర్చలు కొనసాగించేందుకు తాము అంగీకరించామని ఆయన చెప్పారు.
కాగా, యురోపియన్ యూనియన్లో చేరడానికి దరఖాస్తు చేయడం ద్వారా పశ్చిమ దేశాలతో తన సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి ఉక్రెయిన్ ముందడుగు వేసింది. మరోవైపు మాక్సర్ కంపెనీ నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. రష్యాకు చెందిన వందలాది సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగి మరియు సహాయక వాహనాలతో కూడిన కాన్వాయ్ 25 కిలోమీటర్ల మేర బారులు తీరి ఉంది. ముందుకు సాగుతున్న రష్యా సైనికులను నిలువరించడానికి ఉక్రెయిన్ సైన్యం శతధా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్ పట్టణంపై బాంబులదాడి నిర్విరామంగా జరుగుతోంది. అయితే, ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన, అంతర్జాతీయంగా రష్యాపై కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘అణు’ మంటలు పుట్టిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ