తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 156 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 28, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,88,931 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 99.10 శాతంకాగా, మరణాల రేటు 0.52 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 425 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,81,852 కు చేరుకుంది. ప్రస్తుతం 2,968 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం నాడు 19,947 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,35,40,881 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 9,01,152 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 1,074 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ