ఉక్రెయిన్పై రష్యా సైన్యం బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. రాజధాని నగరం కీవ్పై మిస్సైల్స్తో రష్యన్ దళాలు తీవ్రంగా దాడులు చేస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. తెలిసిన వారు లేక, ఎక్కడికి వెళ్లాలో తెలియక బాంబ్ షెల్టర్స్లో, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో, బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. భారతీయ విద్యార్థులు, పౌరులను కాపాడటానికి కేంద్రప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. చిక్కుకుపోయిన వారిని ఇండియా కు తిరిగి తీసుకురావటానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను ప్రారంభించింది.
My heartfelt thanks to FM @BogdanAurescu for his Government’s cooperation. https://t.co/L0EknlIrHT
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ప్రకటించారు. తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. దీనిలో భాగంగా.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రొమేనియా లోకి ప్రవేశించిన వారికోసం ఎయిర్ ఇండియా విమానాలను రెండింటిని సిద్ధం చేశారు. దీనిలో ఒకటి 219 మంది ప్రయాణీకులతో రొమేనియా నుంచి బయల్దేరింది. ఈరోజు రాత్రి 8.45 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ముంబై ఎయిర్ పోర్టుకి చేరుకోనుంది. రేపు (ఆదివారం) అర్ధరాత్రి 2.30 గంటలకు రెండో విమానం ఢిల్లీ చేరుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ