తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్ దేశం నుంచి సరిహద్దుల మీదుగా వస్తున్న ఇండియా స్టూడెంట్స్ కు రొమేనియా ప్రభుత్వం సహాయం అందించటానికి ముందుకొచ్చింది. ఈరోజు తెల్లవారుజామున భారతీయ విద్యార్థుల మొదటి బ్యాచ్ ఉక్రెయిన్ నుండి సుసెవా సరిహద్దు క్రాసింగ్ ద్వారా రొమేనియాకు చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి వస్తున్న భారతీయ విద్యార్థులకు, శరణార్థులకు రొమేనియా ప్రభుత్వం ఆహారంతో పాటు రెండు రోజుల పాటు వసతి కల్పిస్తోందని ఢిల్లీలోని రొమేనియా దేశ రాయబారి డానియెలా సెజోనోవ్ తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి మా దేశంలోకి వస్తున్న భారతీయ విద్యార్థులకు రొమేనియా తన పూర్తి మద్దతునిస్తుంది. భారతదేశం నుండి కాన్సులర్ బృందాలు కూడా వచ్చి ఉన్నాయి అని సెజోనోవ్ వెల్లడించారు.
రొమేనియాలో శరణార్థుల కోసం ఒక సంక్షోభం సెల్ సిద్ధమవుతోంది. అయితే, వారు ఎంతమంది ఉంటారో మాకు తెలియదు. రొమేనియాతో పాటు పొరుగు దేశాలైన పోలాండ్, హంగేరీ కూడా భారీగా తరలి వచ్చే శరణార్థులను ఎదుర్కోవలసి ఉంటుంది. దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే, మేము దీని కోసం సిద్ధంగానే ఉన్నాం అని ఆమె తెలిపారు. సుసేవాలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బృందాలు వారిని భారత్ కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. భారత ప్రభుత్వం పంపించనున్న చార్టర్డ్ విమానాలు రొమేనియాకు చేరుకున్న అనంతరం వారిని స్వదేశానికి తరలించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ