శ్రీలంకతో టీ20 సిరీస్: గాయంతో రుతురాజ్ గైక్వాడ్ దూరం, బీసీసీఐ ప్రకటన

BCCI Announces Batter Ruturaj Gaikwad Ruled Out of T20I Series Against Sri Lanka, BCCI, Ruturaj Gaikwad Ruled out of T20I Series Against Sri Lanka, T20I Series Against Sri Lanka, Ruturaj Gaikwad Ruled out of T20I Series, Ruturaj Gaikwad, T20I Series, Sri Lanka, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Cricket Live Updates, T20, T20I, T20I Latest News, T20I Latest Updates, T20I Live Updates, Mango News, Mango News Telugu,

ప్రస్తుతం భారత్, శ్రీలంక జట్ల​ మధ్య మూడు టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. లక్నోలో ఫిబ్రవరి 24న జరిగిన మొదటి టీ20లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. ఇక ధర్మశాలలో నేడు (ఫిబ్రవరి 26) రెండో టీ20, ఫిబ్రవరి 27న మూడో టీ20 జరగనుంది. కాగా ఈ టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్టులో తాజా మార్పులపై బీసీసీఐ శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడని తెలిపారు.

గురువారం లక్నోలో జరిగిన మొదటి టీ20కి ముందు రుతురాజ్ గైక్వాడ్ తన కుడి మణికట్టు కీలులో నొప్పి గురించి ఫిర్యాదు చేశాడని, బీసీసీఐ వైద్య బృందం పరీక్షించిందని తెలిపారు. ఎంఆర్ఐ స్కాన్ తర్వాత నిపుణుల సంప్రదింపులు జరిగాయని, ఈ నేపథ్యంలో రుతురాజ్ తాజాగా తన గాయం యొక్క తదుపరి నిర్వహణ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని బీసీసీఐ పేర్కొంది. దీంతో ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ మయాంక్ అగర్వాల్‌ ను మిగిలిన రెండు టీ20ల కోసం భారత్ జట్టుకు ఎంపిక చేసిందని, మయాంక్ ధర్మశాలలో జట్టులో చేరాడని తెలిపారు.

2 మరియు 3వ టీ20లకు భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, మయాంక్ అగర్వాల్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 9 =