ప్రపంచవ్యాపంగా పలు దేశాలలో కోవిడ్-19 ప్రభావం పెరుగుతుండడంతో, వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా సంస్థలు నిమగ్నమయ్యాయి. ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సిన్ యొక్క మొదటి, రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు విజయవంతమైనట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండు మరియు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను దేశంలో నిర్వహించేందుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చింది. ట్రయల్స్కు అనుమతిస్తూ డీసీజీఐ ఆగస్టు 2, ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్ఐఐ వెల్లడించింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొవిషీల్డ్ పేరుతో రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ ఫలితాలను విశ్లేషించిన అనంతరం భారత్లో కూడా దీన్ని పరిశీలించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కమిటీ డీసీజీఐకి సిఫార్సు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దేశంలో మొత్తం 15 కు పైగా ప్రాంతాల్లో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరగనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu