తెలంగాణలో రాష్ట్రంలో ఆగస్టు 2, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67,660 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. ఆదివారం నాడు కొత్తగా 983 కేసులు నమోదవగా, 9443 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 551 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 48,609 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 18,500 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.8 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.81 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(983):
- జీహెచ్ఎంసీ – 273
- రంగారెడ్డి – 73
- వరంగల్ అర్బన్ – 57
- కరీంనగర్ – 54
- మేడ్చల్ – 48
- పెద్దపల్లి – 44
- నిజామాబాద్ – 42
- సంగారెడ్డి – 37
- నాగర్ కర్నూల్ – 32
- కామారెడ్డి – 28
- వనపర్తి – 25
- వరంగల్ రూరల్ – 25
- ఖమ్మం – 23
- మహబూబ్ నగర్ – 21
- రాజన్న సిరిసిల్ల – 20
- మహబూబాబాద్ – 18
- మెదక్ – 18
- ఆదిలాబాద్ – 16
- భద్రాద్రి కొత్తగూడెం – 16
- ములుగు -14
- జనగామ – 13
- జగిత్యాల – 12
- జయశంకర్ భూపాలపల్లి – 12
- జోగులాంబ గద్వాల్ – 12
- నల్గొండ – 11
- సూర్యాపేట – 11
- ఆసిఫాబాద్ – 7
- సిద్ధిపేట – 6
- యాదాద్రి భువనగిరి – 5
- వికారాబాద్ – 4
- నిర్మల్ – 2
- నారాయణ్ పేట్ – 2
- మంచిర్యాల – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu