జూలై 8 నుంచి జూలై 20 మధ్య ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లు 3 వన్డేలు, 3 టీ20లలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టులో ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కలవరం మొదలైంది. బ్రిస్టల్ లో ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) సోమవారం నాడు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మరియు నలుగురు సహాయక సభ్యులుకు కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలిపారు. కాగా ఆటగాళ్ల పేర్లను మాత్రం ఈసీబీ వెల్లడించలేదు.
అయితే పాకిస్థాన్తో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ లు షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఈసీబీ స్పష్టం చేసింది. కొత్త వన్డే జట్టుకు బెన్ స్టోక్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడని చెప్పారు. అలాగే 18 మందితో కూడిన కొత్త జట్టును ఈసీబీ ప్రకటించింది. క్యాంపులో చేరేందుకు కొత్త జట్టు ఆటగాళ్లు మరియు సహాయక బృందం సభ్యులు కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు, కోవిడ్ ప్రోటోకాల్లను అనుసరిస్తారని చెప్పారు.
ఇంగ్లాండ్ వన్డే జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, లూయిస్ గ్రెగొరీ, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సాకిబ్ మహమూద్, డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్, మాట్ పార్కిన్సన్, డేవిడ్ పేన్, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్, జేమ్స్ విన్స్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ