ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వాను కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూలై 5న ప్రారంభం కాగా, నేడే (జూలై 19, మంగళవారం) చివరిరోజు. ఈ నేపథ్యంలో విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా ఈ రోజు పార్లమెంటులో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, జైరాం రమేష్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా పలు పార్టీల కీలక నేతలు పాల్గొన్నారు.
మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ జరగనుండగా, అదేరోజున కౌంటింగ్ కూడా చేపట్టనున్నారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10, 2022తో ముగియనుంది. దీంతో ఆగస్టు 11న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసి, పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY