చైనాలో కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో పలు నగరాలూ, పట్టణాలు మళ్ళీ లాక్డౌన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలోనే షాంఘై లోని ప్రముఖ థీమ్ పార్క్ ‘డిస్నీల్యాండ్ పార్క్’ను సోమవారం మూసివేశారు. అయితే మరలా ఈ పార్క్ ఎప్పుడు తిరిగి తెరవబడుతుందనే సమాచారం ఇవ్వలేదు. “ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా.. షాంఘై డిస్నీల్యాండ్, డిస్నీటౌన్ మరియు విషింగ్ స్టార్ పార్క్ మొదలైన వాటిని మూసివేస్తున్నాం. అలాగే షాంఘై డిస్నీ రిసార్ట్ 21 మార్చి 2022 నుండి తాత్కాలికంగా మూసివేయబడుతుంది. మేము ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ స్థానిక అధికారులను సంప్రదిస్తాము. ఈ అసౌకర్యానికి అతిథులకు క్షమాపణలు కోరుతున్నాము” అని తన వెబ్సైట్లో పేర్కొంది.
సాధారణంగా, విదేశాల్లోని అనేక దేశాలతో పోల్చితే చైనా దేశంలో కోవిడ్-19 కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు ఐదవ వేవ్ ప్రారంభంలోనే దేశంలో అత్యధిక సంఖ్యలో కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. దీంతో చైనా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్డౌన్లను విధిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘డిస్నీల్యాండ్ పార్క్’ను మూసివేయాలని నిర్వాహకులకు ఆదేశాలు యివ్వబడ్డాయి. చైనా యొక్క 1.4 బిలియన్ల జనాభాతో పోల్చితే కొత్త కేసుల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ కొత్తగా పెరుగుతున్న కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 3.22 బిలియన్ల వ్యాక్సినేషన్ డోస్ ఇవ్వబడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ