కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20 తర్వాత నాన్ హాట్స్పాట్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులను ప్రకటించింది. అయితే హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల్లో ఈ సడలింపులు వర్తించవని ప్రకటించారు.
కేంద్రం కొత్తగా ప్రకటించిన సడలింపుల వివరాలు:
- షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో రిజిస్టర్ అయినా మున్సిపల్ కార్పోరేషన్స్, మున్సిపాలిటీల పరిధిలో గల దుకాణాలను తెరిచేందుకు అనుమతి.
- నివాసప్రాంతాల్లో విడిగా ఉన్న దుకాణాలు, నివాస సముదాయాల్లో ఉన్న స్వతంత్ర దుకాణాలు తెరిచేందుకు అనుమతి.
- ముఖానికి మాస్క్ లు ధరిస్తూ 50 శాతం సిబ్బందితోనే వ్యాపార కార్యకలాపాలు జరపాలి. సామాజిక దూరం పాటించాలి.
- మున్సిపల్ కార్పోరేషన్స్, మునిసిపాలిటీల పరిమితిలో ఉన్న మార్కెట్ సముదాయాలకు అనుమతి లేదు.
- సింగల్ మరియు మల్టీబ్రాండ్ మాల్స్ లలోని దుకాణాలకు అనుమతి లేదు.
ఇటీవల ప్రకటించిన సడలింపుల వివరాలు:
- పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాలు
- స్టేషనరీ, పుస్తకాల దుకాణాలు
- సీనియర్ సిటిజన్స్ యొక్క ఇన్-హౌస్ కేర్ టేకర్స్
- నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు
- మొబైల్ రీఛార్జి దుకాణాలు
- మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు
- రహదారి నిర్మాణ పనులకు అనుమతి
- సిమెంట్ యూనిట్లు, విక్రయాలకు అనుమతి
- రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
Market complexes, except those within the limits of municipal corporations and municipalities, are allowed to open.
Mandatory: 50% strength of workers, wearing of masks & observing #SocialDistancing
Relaxations not applicable in #Hotspots/containment zones
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) April 24, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu