కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. 2015 లో తొలిసారిగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎంపికవగా, 2018లో రెండోసారి, 2022లో మూడోసారి ఆయన నూతన కేంద్ర కమిటీ చేత ఎన్నుకోబడ్డారు. కేరళలోని కన్నూర్లో జరుగుతున్న 23వ పార్టీ కాంగ్రెస్ చివరి రోజున కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీలో 85 మంది సభ్యులు ఉన్నారు. పార్టీ కేంద్ర కమిటీ మరియు పొలిట్బ్యూరో సభ్యులకు 75 ఏళ్ల వయోపరిమితిని నిర్ణయించుకోవడంతో ఈసారి ఈ రెండు విభాగాల్లో సభ్యుల సంఖ్య తగ్గింది. కొత్తగా ఏర్పాటైన పొలిట్బ్యూరోలో 17 మంది సభ్యులు ఉన్నారు. ఇక కేంద్ర కమిటీ శాశ్వత ఆహ్వానితులుగా రాజేంద్ర సింగ్ నేగి, సంజయ్ పరాటేను, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్. రామచంద్రన్ పిళ్లై, బిమన్ బోస్, హన్నన్ మొల్లాను ఎన్నుకున్నారు.
17 మంది సభ్యుల సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో:
1. సీతారాం ఏచూరి
2. ప్రకాష్ కారత్
3. పినరయి విజయన్
4. బృందా కారత్
5. మాణిక్ సర్కార్
6. కొడియేరి బాలకృష్ణన్
7. ఎంఏ బేబీ
8. సూర్జ్య కాంత మిశ్రా
9. మహమ్మద్ సలీం
10. సుభాషిణి అలీ
11. బి.వి.రాఘవులు
12. జి.రామకృష్ణన్
13. తపన్ సేన్
14. నీలోత్పల్ బసు
15. రామచంద్ర డోమ్
16. ఎ.విజయరాఘవన్
17. అశోక్ ధావలే
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ