కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల సలహాలకు అనుగుణంగా పార్లమెంటు సమావేశాలకు ముందు పూర్తి వైద్య పరీక్షల కోసం అమిత్ షా గత ఆదివారం నాడు ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu