తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార గడువు ఈ రోజు (అక్టోబర్ 27, బుధవారం) సాయంత్రం 7 గంటలతో ముగియనుంది. సాధారణంగా పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచార గడువు ముగియనుండగా, కరోనా పరిస్థితుల దృష్ట్యా పోలింగ్ కు 72 గంటల ముందే అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. హుజురాబాద్ లో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రజలతో మమేకమై తమ ప్రచారంతో హోరెత్తించారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటుగా విమర్శలు, సవాళ్లుతో సాగడంతో ఈ ఉపఎన్నికపై రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకుంది. హుజురాబాద్ లో అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించి, నవంబర్ 2 వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఎక్కువగా చర్చ జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో మరికొన్ని రోజులు వేచిచూడాలి.
హుజూరాబాద్ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే:
- బీజేపీ – ఈటల రాజేందర్
- టీఆర్ఎస్ – గెల్లు శ్రీనివాస్ యాదవ్
- కాంగ్రెస్ – బల్మూరి వెంకట్ నర్సింగ్ రావు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ