ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని ఫ్రెంచ్ సెనేట్లో అక్టోబర్ 29న జరగనున్న ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరమ్’లో ప్రసంగించేందుకు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ బృందం బుధవారం ఉదయం ఫ్రాన్స్ కు బయల్దేరింది. హెల్త్కేర్, అగ్రిబిజినెస్, క్లైమేట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సహా పలు రంగాల్లో భారత్ లో పెట్టుబడులు, బిజినెస్ పై రౌండ్ టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో మంత్రి కేటీఆర్ సమావేశం కానున్నారు. ప్రాన్స్ కు వెళ్లినవారిలో మంత్రి కేటీఆర్ తో పాటుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ