67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ అగ్ర కథానాయకుడు, సూపర్స్టార్ రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు. భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరైన రజనీకాంత్, నటుడుగా, నిర్మాతగా మరియు స్క్రీన్ రైటర్గా చేసిన కృషిని గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం రజనీకాంత్ కు ఈ అవార్డు ప్రకటించింది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేశారు.
ఇక జాతీయ ఉత్తమ నటులుగా ధనుష్(అసురన్), మనోజ్ బాయ్పాయ్(భోంస్లే), ఉత్తమ నటిగా కంగనా రనౌత్(మణికర్ణిక) అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ నుండి జాతీయ ఉత్తమచిత్రం(తెలుగు)గా నాని నటించిన జెర్సీ చిత్రం ఎంపికయింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో నవీన్ నూలి జెర్సీ సినిమాకి అవార్డు దక్కించుకున్నాడు. ఉత్తమ పాపులర్ వినోదాత్మక చిత్రంగా మహర్షి, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మహర్షి చిత్రానికి గానూ రాజు సుందరం జాతీయ అవార్డులను దక్కించుకున్నారు. వీరంతా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సోమవారం అవార్డులను అందుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ