సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై ఉత్కంఠ వీడింది. తమిళనాడులో ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త అందింది. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ఈ రోజు రజనీకాంత్ వెల్లడించారు. పార్టీకి సంబంధించిన వివరాలపై డిసెంబర్ 31 ప్రకటన చేయనున్నట్టు తెలిపారు. 2021 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రజనీకాంత్ ప్రకటనతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. తమిళనాడులో రజనీ అభిమానులు పెద్దఎత్తున సంబరాలు మొదలుపెట్టారు.
మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదు:
అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు ప్రజల కోసం తన ప్రాణాలైన సంతోషంగా ఇస్తానని అన్నారు. తన రాజకీయ ప్రవేశంపై ఇప్పటికి కొందరు విమర్శలు చేస్తూనే ఉన్నారని చెప్పారు. రాజకీయ పార్టీ స్థాపన విషయంలో ముందుగానే రాష్ట్రంలో పర్యటించాలని భావించినా కరోనా వలన సాధ్యం కాలేదని చెప్పారు. డాక్టర్లు వద్దని సూచిస్తున్నా కూడా ప్రజలు, అభిమానుల కోసం రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, మార్పు ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగదని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, అభిమానం, ఆదరణతో కష్టపడి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తానని రజనీకాంత్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
ஜனவரியில் கட்சித் துவக்கம்,
டிசம்பர் 31ல் தேதி அறிவிப்பு. #மாத்துவோம்_எல்லாத்தையும்_மாத்துவோம்#இப்போ_இல்லேன்னா_எப்பவும்_இல்ல 🤘🏻 pic.twitter.com/9tqdnIJEml— Rajinikanth (@rajinikanth) December 3, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ