బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8 న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె బెయిల్ పిటిషన్ ను స్పెషల్ కోర్టు ఇప్పటికే పలుసార్లు తిరస్కరించింది. అయితే ఎట్టకేలకు దాదాపు నెల రోజుల తర్వాత రియాచక్రవర్తికి బెయిల్ లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తునట్టు బుధవారం నాడు బాంబే హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెయిల్ మంజూరులో భాగంగా లక్ష రూపాయల పూచీకత్తుతో పాటుగా, ప్రతి పది రోజులకు ఓసారి సమీప పోలీస్ స్టేషన్లో రియా చక్రవర్తి హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.
అలాగే ఆమె తన పాస్పోర్ట్ను కూడా అప్పగించాల్సి ఉంటుందని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ఉద్యోగులు శామ్యూల్ మిరండా, దిపేశ్ సావంత్ లకు కూడా బెయిల్ మంజూరు కాగా, రియా చక్రవరి సోదరుడు షోవిక్ చక్రవర్తికి మాత్రం బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu