ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే నాయకుడు విజయకాంత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, చెన్నై లోని మియోట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నుంచి కోలుకున్న ఆయన మంగళవారం సాయంత్రం మరోసారి మియోట్ హాస్పిటల్ లో చేరారు. దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో డీఎండీకే పార్టీ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేస్తూ కరోనా నుంచి కోలుకున్నాక తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తమే విజయకాంత్ హాస్పిటల్ లో చేరారని పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, సోషల్మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. మరోవైపు విజయకాంత్ ఆరోగ్యంపై మియోట్ హాస్పిటల్ బులెటిన్ విడుదల చేసింది. “ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. వీలైనంత త్వరగా ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తాం” బులెటిన్ లో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu