దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు 5 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 3,993 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,29,71,308 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 108 మంది మరణించడంతో మరణాల సంఖ్య 5,15,210 కి పెరిగింది. ఇక దేశంలో కొత్తగా 8,055 కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,24,06,150 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.68 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. ప్రస్తుతం 49,948 (0.12%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కేరళ (1223), మిజోరాం (839), మహారాష్ట్ర (225), తమిళనాడు (158), ఢిల్లీ (158), కర్ణాటక (155), హర్యానా (137), రాజస్థాన్ (133), ఉత్తర్ ప్రదేశ్ (132), ఒడిశా (120) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద మంగళవారం ఉదయం 7 గంటల వరకు 179.13 కోట్ల (1,79,13,41,295) కరోనా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని తెలిపారు. అలాగే గత 24 గంటల్లో 21 లక్షలకుపైగా (21,34,463) వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ