క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం మంచి మజా లభించనుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో నేడు తుది అంకానికి తెర లేవనుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే మ్యాచ్ కనీసం పది ఓవర్లు జరగాల్సి ఉంటుంది. అప్పుడే విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇరు జట్లు ఈ పది ఓవర్ల కోటా ఆడలేకపోతే అప్పుడు రెండు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ డేకు అదనపు సమయం ఇవ్వాలని ఈవెంట్ టెక్నికల్ కమిటీ నిర్ణయించింది. కాగా మ్యాచ్ నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగనుంది.
ఇక పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్లు రెండూ టోర్నమెంట్ను పేలవంగానే ప్రారంభించాయి. బాబర్ ఆజం నేతృత్వం లోని పాకిస్తాన్ అనూహ్యంగా ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఆరంభంలో పాకిస్థాన్.. భారత్ మరియు జింబాబ్వేతో జరిగిన మొదటి రెండు మ్యాచ్లలో వరుసగా ఓడిపోయింది. కానీ ఇతర జట్ల జయాపజయాల ఫలితాలు వారికి అనుకూలంగా రావడంతో ఎవరూ ఊహించని విధంగా వారు ఫైనల్ చేరుకుంది. అలాగే జోస్ బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ కూడా కూడా తమ తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్పై గెలిచిన తర్వాత వర్షంతో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత తమ ఆట తీరుని మెరుగుపరుచుకుని సెమీఫైనల్లో టీమిండియాపై అద్భుత విరాజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టారు. దీంతో ఈరోజు మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.
జట్లు అంచనా
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది.
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE