తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా తేలాక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఇంతకుముందే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్యే గణేష్ గుప్తా కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu