ఒక్క రోజే 1438 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Tamil Nadu Breaking News, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus Cases, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Covid-19 Cases, Tamil Nadu Government, Tamil Nadu Reports 1438 New Covid-19 Cases

భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1438 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 1116 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,694 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 19,809 కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన 12 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 232 కి చేరింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 861 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 15,762 కి చేరింది. ప్రస్తుతం 12,697 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 4 =