పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. పుదుచ్చేరిలోని రాజ్ నివాస్ లో జరిగిన కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తమిళిసై చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, మంత్రులు పాల్గొన్నారు.
ముందుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న కిరణ్ బేడీని ఆ పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకం జరిగే వరకు కిరణ్ బేడీ స్థానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ