తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 28, మంగళవారం నాడు ఒక్కరోజే 6972 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,688 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 96,438 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు మంగళవారం నాటికీ రాష్ట్రంలో 24,75,866 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (జూలై 28, మంగళవారం):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,27,688
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,66,956
- యాక్టీవ్ కేసులు – 57,073
- జూలై 28 న నమోదైన కేసులు – 6972
- జూలై 28 న డిశ్చార్జ్ అయినవారు – 4707
- జూలై 28 న నమోదైన మరణాల సంఖ్య – 88
- మొత్తం మరణాల సంఖ్య – 3,659
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu