ఇంగ్లండ్తో కీలక టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో శనివారం రోహిత్ శర్మకు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ నిర్వహించగా, దీనిలో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో రోహిత్ శర్మ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నాడని తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పేర్కొంది. దీంతో కీలక టెస్టులో రోహిత్ పాల్గొనడం అనుమానంగా ఉంది.
UPDATE – #TeamIndia Captain Mr Rohit Sharma has tested positive for COVID-19 following a Rapid Antigen Test (RAT) conducted on Saturday. He is currently in isolation at the team hotel and is under the care of the BCCI Medical Team.
— BCCI (@BCCI) June 25, 2022
జూలై 1 (శుక్రవారం) నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్తో రీషెడ్యూల్ చేయబడిన ఐదవ టెస్టుకు ముందు రోహిత్కు పాజిటివ్గా తేలిందని బీసీసీఐ ధృవీకరించింది. ఈ క్రమంలో ఆదివారం రోహిత్కి మరోసారి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించనున్నామని వెల్లడించారు. స్థానిక జట్టుతో జరిగిన 4-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో మిగిలిన ఆటగాళ్లు పాల్గొన్నప్పటికీ, రోహిత్ మాత్రం లీసెస్టర్షైర్లోని టీమ్ హోటల్లో ఒంటరిగా ఉన్నాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆదివారం తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY