దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారిగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తాజాగా భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ధోని తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్ సింగ్ లకు కరోనా పాజిటివ్ గా తేలింది. వారిద్దరూ ప్రస్తుతం రాంచీలోని పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2021లో భాగంగా ఎంఎస్ ధోని ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. బుధవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్తో ముంబయి వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ