ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉక్రెయిన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను పొరుగు దేశాలకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్-రష్యా వివాదం, భారతీయుల తరలింపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నాడు ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తదితరులు పాల్గొన్నారు. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం 2 గంటలకుపైగా కొనసాగింది. భారతీయ విద్యార్థుల భద్రతకు భరోసా ఇవ్వడం, వారిని సురక్షితంగా దేశానికి తీసుకురావడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ అన్నారు.
అలాగే విద్యార్థుల తరలింపును వేగవంతం చేసేందుకు ఉక్రెయిన్ కు పొరుగున ఉన్న రొమేనియా, హంగరి, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ సహా ఇతర దేశాల సహకారం మరింత పెంపొందించుకోవడంపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, ఇతర పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగా’ కింద ఇప్పటికే శనివారం నుండి 900 మందిని పైగా దేశానికి తిరిగి తీసుకువచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ