ఒకవైపు రష్యా – ఉక్రెయిన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు చర్చలకు రెండు దేశాలు అంగీకరించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు “నిరోధక బలగాలను” హై అలర్ట్లో ఉంచాలని డిఫెన్స్ చీఫ్లను ఆదేశించిన సమయంలోనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాత్రం రష్యాతో ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చర్చల్లో పాల్గొనటానికి అంగీకరించారు. బెలారస్ బోర్డర్ రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక చర్చలకు వేదిక అవుతోంది. ప్రిప్యాట్ నదికి సమీపంలో ఉక్రేనియన్-బెలారసియన్ సరిహద్దులో ఉక్రేనియన్ ప్రతినిధి బృందం రష్యన్ ప్రతినిధుల బృందంతో సమావేశమయింది. కాగా, ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈరోజు (సోమవారం) ఉక్రెయిన్ లో కొనసాగుతున్న సంక్షోభంపై UN జనరల్ అసెంబ్లీ ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా, ఉక్రెయిన్పై దాడి చేయడానికి రష్యా దళాలను తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి బెలారస్ అనుమతించటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే బెలారస్ నాయకుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్య పిలుపు మేరకు చెర్నోబిల్ సమీపంలో.. బెలారస్ సరిహద్దులో రష్యాతో చర్చలు జరపడానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఇప్పటికే, రష్యా దాడిలో 14 మంది చిన్నారులు సహా 352 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ