ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- ‘‘మిషన్ కర్మయోగి-నేషనల్ ప్రోగ్రాం ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్’’ కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సివిల్ సర్వీసుల సామర్థ్య పెంపునకు ఉద్దేశించి ఈ జాతీయ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. వ్యక్తిగత, సంస్థల స్థాయిలో మెరుగైన ప్రజా సేవలను అందించడానికి వీలుగా, సామర్థ్య పెంపు దిశ లో సమగ్రమైన సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడనుంది.
- భూగర్భ, ఖనిజవనరుల రంగంలో పరస్పర సహకారానికి ఇండియా, ఫిన్లాండ్ల మధ్య అవగాహనా ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.
- నాణ్యమైన వస్త్ర రంగంలో సహకారం కోసం ఇండియా మరియు జపాన్ మధ్య అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
- జమ్మూ కశ్మీర్లో డోంగ్రి, హిందీ, కశ్మీరీ లను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu