ఐపీఎల్లో కరోనా కలకలం రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అన్ని జట్ల ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది కఠినమైన బయోబబుల్ ఆంక్షల మధ్య ఉంటున్నప్పటికీ ఇలా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. టీమ్ ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్ వైరస్కు పాజిటివ్ పరీక్షించినట్లు ధృవీకరించబడిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ ఇప్పుడు కలవరం చెందుతోంది. అయితే ప్రస్తుతం పాట్రిక్ ని డీసీ మెడికల్ టీమ్ నిశితంగా పరిశీలిస్తోందని ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ నుండి ఇంకెవరైనా ఈ వైరస్ బారిన పడ్డారో లేదో తెలియదు. అందరికీ పరీక్షలు నిర్వహించారని, రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నామని క్యాపిటల్స్ ప్రతినిధులు తెలిపారు. అయితే ఢిల్లీ రేపు ఆర్సీబీతో కీలక మాచ్ ఆడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడగా అందులో రెండింటిలో విజయం సాధించగా, మరో రెండింట్లో పరాజయం పాలయ్యింది. దీంతో ప్రస్తుతం లీగ్లో 7వ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ కి అర్హత సాధించాలంటే తదుపరి మ్యాచ్లలో బాగా ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగింది. దీనిలో వారు 44 పరుగుల తేడాతో గెలిచారు. ఈ సందర్భంలో ఫర్హార్ట్ ఒక వేదిక నుండి మరొక వేదికకు ప్రయాణిస్తున్నప్పుడు కోవిడ్ -19 బారిన పడి ఉండవచ్చని భావిస్తున్నారు. 2019 ఆగస్టులో ఫర్హార్ట్ ఢిల్లీ టీములో చేరాడు. గతం (2015) లో అతనికి టీమిండియాతో పనిచేసిన అనుభవం ఉంది. 2019 ప్రపంచకప్ అనంతరం టీమిండియాతో ఒప్పందం ముగిసింది. దీంతో ఫర్హార్ట్ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ మరియు పంజాబ్ కింగ్స్తో కూడా పనిచేశాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ