కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 8, గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా కేబినెట్ విస్తరణ జరగబోతుంది. కేంద్ర కేబినెట్ లో 81 మందికి అవకాశముండగా, ప్రస్తుతం 53 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. కాగా ఈ విస్తరణలో మరో 22 మందికి అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్ ను విస్తరించనున్నట్టు సమాచారం. ఒకటికంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారి నుంచి, కొత్తవారికి కేటాయించడంతో పాటు కేబినెట్ లో మార్పులు కూడా చోటుచేసుకోనున్నాయి.
కేబినెట్ విస్తరణ కోసం జ్యోతిరాదిత్య సింధియా, శర్వానంద్ సోనోవాల్, నారాయణ్ రాణె, సుశీల్ మోదీ, పశుపతి పరాస్, అనుప్రియా పటేల్, పంకజ్ చౌధురి, రీటా బహుగుణ జోషి, రాంశంకర్ కథేరియా, రాహుల్ కస్వాన్, లల్లాన్ సింగ్, వరుణ్ గాంధీ వంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ నేడు జరగాల్సిన సమావేశం రద్దు అయినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ