దేశవ్యాప్తంగా 2022-23 మార్కెట్ సీజన్లో ఆరు రకాల రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) సమావేశమై పంటల మద్దతు ధర పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం కోసం ప్రభుత్వం రబీ మార్కెటింగ్ సీజన్ 2022-23లో కనీస మద్ధతు ధరను పెంచినట్టు పేర్కొన్నారు.
కనీస మద్దతు ధర పెరిగిన పంటలివే:
- గోధుమలపై కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.40 పెంపు – ధర రూ.2015 గా నిర్ణయం
- బార్లీపై రూ.35 పెంపు – ధర రూ.1635 (క్వింటాల్కు)
- రేప్సీడ్స్ అండ్ ఆవాలుపై రూ.400 పెంపు – ధర రూ.5050
- మసూర్(లెంటిల్) పప్పుపై రూ.400 పెంపు – ధర రూ.5500
- కుసుమలపై రూ.114 పెంపు – ధర రూ.5441
- గ్రామ్/శనగలపై రూ.130 పెంపు – ధర రూ.5230
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ