కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, సినీ, క్రీడా ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు బుధవారం నాడు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“ఈ రోజు నాకు కరోనా పాజిటివ్ గా తేలిందని మీకు తెలియజేస్తున్నాను. వైద్యుల సలహా మేరకు మందులు మరియు చికిత్స తీసుకుంటున్నాను. ఇటీవల నాతో సంప్రదించిన వారందరూ తమను తాము గమనించుకుని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్ధిస్తున్నాను. ఇక కేంద్ర విద్య శాఖ అన్ని పనులను అవసరమైన జాగ్రత్తలు పాటిస్తూ సాధారణంగా నిర్వహిస్తున్నాను” అని రమేష్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,56,16,130 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ