మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 21, బుధవారం కూడా 67468 కరోనా కేసులు, 568 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40,27,827 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 61,911 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 54,985 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 32,68,449 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 81.15 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,95,747 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 2,46,14,480 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ