కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెకు ప్రైవేట్ వార్డులో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జనరల్ చెకప్ నిమిత్తం మరియు స్వల్ప స్టమక్ ఇన్ఫెక్షన్ తో అస్వస్థతకు గురయిన నేపథ్యంలోనే చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరినట్టు తెలుస్తుంది. అలాగే ఆమె త్వరలోనే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ కానున్నట్టు సమాచారం. కాగా ఆమె ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు అధికారక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE