బీజేపీ జాతీయనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటుగా సిక్కిం, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అమిత్ షా ట్వీట్ చేస్తూ, “సిక్కిం మరియు అస్సాంలో నా 3 రోజుల పర్యటన కోసం ఈశాన్య ప్రాంతానికి బయలుదేరాను. ఈరోజు గాంగ్టక్లో ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ జోన్స్ డెయిరీ కోఆపరేటివ్ కాన్క్లేవ్-2022 ప్రారంభోత్సవం జరుగుతుంది, ఆ తర్వాత అస్సాంలో అనేక కార్యక్రమాలు జరుగుతాయి” అని పేర్కొన్నారు.
అమిత్ షా ముందుగా శుక్రవారం ఉదయం 11.50 గంటలకు గాంగ్టక్ రాజ్ భవన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 12.15 గంటలకు గాంగ్టక్ మనన్ భవన్ లో కోఆపరేటివ్ డైయిరీ కాన్క్లేవ్- 2022ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సిక్కిం బీజేపీ కోర్ గ్రూప్ తో సమావేశం కానున్నారు. అనంతరం అస్సాంలోని గౌహతి చేరుకొని స్టేట్ గెస్ట్ హౌస్ లో సాయంత్రం 6 గంటలకు అస్సాం బీజేపీ కోర్ గ్రూప్ తో సమావేశం కానున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా శుక్రవారం అస్సాంలో పర్యటించనున్నారు. గౌహతిలోని బసిస్తా ప్రాంతంలో కొత్తగా నిర్మించిన అస్సాం రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని జేపీ నడ్డా ప్రారంభించనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY