హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో రోజువారీగా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 8, మంగళవారం నాడు బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకొని, శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ముందుగా మంగళవారం సాయంత్రం 4:40 గంటలకు అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్ కు చేరుకుంటారు. ఈ సందర్భంగా యాగశాలలో నిర్వహించే పూజల్లో అమిత్ షా పాల్గొననున్నారు. అనంతరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని, 216 అడుగుల ఎత్తు గలిగిన పంచలోహ శ్రీరామానుజాచార్య విరాట్ (సమతామూర్తి) విగ్రహాన్ని దర్శించుకోనున్నారు. అలాగే 108 ఆలయాలతో నిర్మించిన దివ్యదేశ ఆలయాల సమూహాన్ని సందర్శించనున్నారు. ఇక రాత్రి 8 గంటలకు అమిత్ షా శంషాబాద్ కు చేరుకొని, ఢిల్లీకి తిరిగి పయనమవనున్నారు. మరోవైపు అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ