హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో.. అన్నట్లుగా జరుగుతున్నాయి. ఆశ్రమ పరిసరాలు ‘జై శ్రీమన్నారాయణ’ అంటూ భక్తుల నినాదాలతో మార్మోగుతున్నాయి. కన్నుల పండుగగా జరుగుతున్న ఈ వేడుకలకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మొదటగా ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలోని గెస్ట్ హౌస్ కు చేరుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మైహోమ్ అధినేత రామేశ్వర్ రావు తదితరులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా.. సీఎం జగన్, చినజీయర్ స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం వేడుకలకు రావడం చాలా ఆనందాన్నిచ్చిందని సీఎం జగన్ తెలిపారు. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టం అని ఆయన అన్నారు. వెయ్యి సంవత్సరాలకు పూర్వమే మనుషులలో సమానత్వం గురించి చెప్పిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యుడని సీఎం జగన్ అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఉన్నత విలువలతో జీవనం కొనసాగించిన గొప్ప ఆదర్శవాది అని సీఎం జగన్ ఈ సందర్భంగా శ్రీ రామానుజులని గుర్తుచేసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ