కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆగస్టు 4, మంగళవారం నాడు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. డాక్టర్ల సూచన మేరకు హర్యానాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu